SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ వాసులు ఇటీవల సోనియమ్మ ప్రకటించిన 6 గ్యారంటీలకు మరియి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్బంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేసీయార్ నియంత పాలనకు చరమగీతంపాడే రోజు త్వరలోనే ఉందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీలను తీసుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పని చేయాలనీ కోరారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు, INTUC నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

Whatsapp Image 2023 10 17 At 1.31.05 Pm

SAKSHITHA NEWS