SAKSHITHA NEWS

నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తారా?

సైకో ఇజంతో విలువలు మరిచి శునకానందం పొందుతారా?

ఇంకా ఎన్నాళ్లీ అరాచకం

వచ్చేది తెదేపా ప్రభుత్వమే అసలు, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం తెదేపా నేతలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నాయకుడు పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు ధర్మవరం పట్టణంలో స్థానిక గాంధీ సర్కిల్ నందు గల గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కళ్ళకు గంతలు గట్టుకుని తమ నిరసన తెలియజేశారు


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రజాస్వామ్య విలువలను ఏమాత్రం పాటించకుండా పూర్తిగా అహంకారపూరిత ధోరణితో రాజ్యాంగ విలువలను సైతం తుంగలో తొక్కి రాజకీయ ప్రత్యర్థుల నాశనమే లక్ష్యంగా బ్రిటిష్ పాలకులు మాదిరిగా అన్ని కీలక శాఖల్లోనూ తన మనుషుల్ని నియమించుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ప్రశ్నించే ప్రతి ఒక్కడి మీద తప్పులు కేసులు బనాయించడం తద్వారా వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం లాంటి నియంతృత్వ పోకడల్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా అవినీతి పనులు మాత్రమే కొనసాగిస్తున్నారని ఇలాంటివన్నీ ప్రతిపక్ష నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ పోరాడుతున్నందుకే 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా అవినీతి మరక అంటని చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన ఈ గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికే ఈరోజు కళ్ళకు గంతులు కట్టుకొని దీక్ష చేస్తున్నామని తెలియజేశారు


SAKSHITHA NEWS