SAKSHITHA NEWS

కొండరెడ్డి కుటుంబాలకి దుపట్ల వితరణ
     అశ్వారావుపేట మండలం ,తిరుమలకుంట పంచాయితీలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారి
సూచన మేరకు ఈ రోజు నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కొండరెడ్డి కుటుంబాలకి దుపట్ల పంపిణీ చేశారు.
నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా మరియు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారి సహకారంతో బిర్రం వెంకటేశ్వరావు మండలంలో అనేక గిరిజన గ్రామాల్లో దుపట్లు ,మహిళలకు,వికలాంగులకు బట్టలు పంపిణీ ,హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో BRS మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్న,పంచాయితీ వైస్ ప్రెసిడెంట్ జుజ్జూరి రాంబాబు,BRS పార్టీ గ్రామ ప్రెసిడెంట్ చెన్నరావు,పానుగంటి లక్ష్మణరావు,జుజ్జురీ సత్యనారాయణ పాల్గొన్నారు.

SAKSHITHA NEWS