SAKSHITHA NEWS

మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ధర్మ విద్యాలయంలో SC కార్పొరేషన్ ద్వారా వికారాబాద్ నియోజకవర్గ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి, 60 మందికి ఉచిత కుట్టు మిషన్లు – సర్టిఫికెట్స్ అందజేశారు.

మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

▪️ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై మరియు బెనిఫిట్స్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

▪️మహిళలను వంటింటికి పరిమితం చేయకుండా వారిలోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు, ప్రభుత్వం అందించిన కుట్టు మిషన్లు సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS