SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుండి క్షేమంగా బయట పడాలని త్రిపురాంతకం మండలం నాయకులు స్థానిక శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తెలుగు దేశం పార్టీ బీసీ యాదవ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు మాజీ మండల పార్టీ అధ్యక్షులు వూట్ల సీతారామయ్య మోటాకట్ల రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసారని ఆయన దేశానికీ గొప్ప ప్రధాని ని అందించారాని రాష్ట్రము లో 14సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పరిపాలన చేసారని కియా హీరో లాంటి ఎన్నో కంపేనీలు రాష్ట్రానికి తెచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారని హైదరాబాద్ కి హైటేక్ సిటీ నిర్మించి వేలాదిమందికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చారని వారంతా స్వచ్చందగా ధర్నాలు చేస్తున్నారని ఆయన ఎంత గొప్ప నాయకుడో ప్రజలందరికి తెలుసని ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పూర్తి చేయాలన్న రాజధాని నిర్మించాలన్న ఒక్క చంద్రబాబు నాయుడు కే సాధ్యమని అలాంటి ఉన్నత మైన గొప్ప నాయకులు చంద్రబాబు ని అయన కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారని అన్నారు
ఈ కార్యక్రమం లో లాయర్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ సిరిగిరి నరసయ్య, పిల్లి వెంకటరావు, పరిమి శ్రీను, దండెబోయిన బాజీ నాయుడు, పి సుబ్రహ్మణ్యం, పెద్దన్న, చిన్న అంకయ్య, మెట్టకాళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS