7వ రోజు రిలే నిరాహార దీక్ష

Spread the love

7వ రోజు రిలే నిరాహార దీక్ష

దళితలను మోసం చేసిన దగా కోరు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసన గా జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాలతో బాపట్ల నియోజకవర్గ ఎస్సి సెల్ ఆద్వర్యం లో బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం మేము సైతం అని ఎస్సి సెల్ నాయకులు నల్లకండువాలు వేసుకొని రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

జగన్ రెడ్డి పరిపాలనలో దళితులకు ప్రశ్నించే హక్కు లేదు. హక్కుల కోసం పోరాడితే చంపేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం లో దళితులకు ఉచితంగా విద్యుత్ అని చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కరెంటు చార్జీలు పెంచారో ప్రజలు గమనిస్తున్నారు

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు లేదు రాజారెడ్డి రాజ్యాంగం అమలు లో ఉందన్నారు.

దళితులను చంపిన, హింసించిన ఏ ఒక్క కేసు లోనూ వైసిపి నేతలకు శిక్ష పడలేదు. దళితులు ఎవరైనా ప్రశ్నిస్తే పిచోళ్లనే ముద్ర వేసి వేధించి చంపేస్తున్నారన్నారు.

ఈ దీక్షలు మా నాయకుడు బయటికి వచ్చేంతవరకు ఆగేది లేదని నిర్విరామంగా కొనసాగుతాయని అన్నారు.

రాష్ట్రంలో ఇటువంటి నీచ రాజకీయాలు, అదేవిధంగా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని రాష్ట్ర ప్రజలు ఈ ముఖ్యమంత్రి పై అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు

అనంతరం చంద్రబాబు కి ఆ భగవంతుడు మీకు తోడుగా ఉన్నారాని,మీరు ఏ తప్పు చేయలేదని మీ కోసం ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారని చంద్రబాబు కి ఉత్తరం రాశారు.

ఈ కార్యక్రమం లో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సి సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page