SAKSHITHA NEWS

పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నా…

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు ఆధ్వర్యంలో BJP కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కట్టెల పొయ్యి మీద వంట వార్పు నిర్వహించారు. అనంతరం MLC మాట్లాడుతూ BJP కేంద్రం ప్రభుత్వం పాలన పేద ప్రజల జీవనానికి భారంగా మారిందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశంలో సుపరిపాలన ఒక్క BRS పార్టీ, కేసీఆర్ సార్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్లకు, కౌన్సిలర్లు, BRS పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS