SAKSHITHA NEWS

మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడి.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మైలవరం సచివాలయం-4 పరిధిలో సంక్షేమానికి రూ.23,93,01,167లను వెచ్చించినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
మైలవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఇందులో రూ.10,20,53,167లు నేరుగా సంక్షేమ పథకాల అమలుకు నేరుగా పేదలకు చెల్లించినట్లు వెల్లడించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఇళ్లస్థలాలు, గృహనిర్మాణం కోసం రూ.13,60,50,000లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సీఎం జగనన్న పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS