మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం

Spread the love

ఐజ్వాల్: మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు..

మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో సుమారు 35-40 మంది కార్మికులు పనిచేస్తున్నారని బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో 17 మంది మృతి చెందారని కొంత మంది గాయపడగా మరికొంతమంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు..

Related Posts

You cannot copy content of this page