SAKSHITHA NEWS

సాక్షిత : పర్వత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మం , అన్నయ్య సి రవి 12వ వర్ధంతి సందర్భంగా బ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు *మొహమ్మద్ గౌసుద్దీన్ * ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు నోట్ బుక్స్ వారి వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్వత్ నగర్ లో గత 12 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు కానీ నోటుబుక్కుల పంపిణీ కానీ బట్టలు పంపిణీలు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు బ్రహ్మంగారి అన్న సి రవి ఆత్మ శాంతి చేకూరాలని కార్పొరేటర్ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, జాహిద్ షరీఫ్ బాబా, టిఆర్ఎస్ రాజు, గంగపుత్ర శంకర్, విష్ణు, శ్యామ్ సుందర్ రెడ్డి, రాము యాదవ్, కళ్యాణ్ నాయక్, రాజు, పవన్, భాను, సుంకన్న, కృష్ణ, సీనియర్ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS