అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి

Spread the love

సాక్షిత : అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి పురస్కరించుకుని ..క్షత్రియ యువజన సంఘం అధ్వర్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ..కూకట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులుకు పరీక్షల సమీపిస్తున్న తరుణంలో వారికి ..పెన్నులు.. పేడ్.. కంపాస్ బాక్స్ కిట్లను అందించారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా వారికి కిట్లను అందించడం ఎంతో సంతోషంగా ఉందని క్షత్రియ యువజన సంఘం సభ్యులను మరియు వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న శ్యామల రాజు ని అభినందించారు… అంతేకాకుండా నియోజకవర్గంలోని విద్యార్థులుకు తాను హామీ ఇచ్చినట్టుగా పదవ తరగతిలోని 10/10 సాధించిన విద్యార్థులకు తన సొంత నిధులతో ఐ ప్యాడ్ లను అందిస్తానని తెలుపుతూ..

తల్లితండ్రులు తమ పై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు సూచించారు.. అంతే కాకుండా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి ప్రాణ త్యాగం చేసిన గొప్ప మహనీయుడని అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడని …ఇటువంటి వారి గొప్ప చరిత్ర తెలుసుకోవాలని విద్యార్థులకు తెలిపారు… ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ.. ఎంఈఓ ఆంజనేయులు, క్షత్రియ యువజన సంఘం సభ్యులు శ్యామల రాజు, డిఎస్ రాజు, వరహాల రాజు ,సుధీర్ వర్మ, వర్మ, రాము .. భీమరాజు, కృష్ణంరాజు..పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page