SAKSHITHA NEWS

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ -2 లో పదమూడు లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని చెప్పారు. ఈ మేరకు సకాలంలో నిధులు మంజూరు చేస్తూ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, రఘు, వర్క్ ఇస్పెక్టర్ రవికుమార్, ఎంటోమొలజీ సూపర్వైజర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS