గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీ

SAKSHITHA NEWS

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

సాక్షిత వనపర్తి జూన్ 7 జిల్లాలోజూన్ 9, ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలియజేశారు.
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ పై శుక్రవారం ఉదయం అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ , డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నియమ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలో అనుమతి లేదని స్పష్టంగా వివరించారు.
ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలో అనుమతించాలని 10 గంటలకు గేట్ లు మూసి వేయాలని అన్నారు. 9.30 నుండి బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని సూచించారు. పరీక్ష అయిపోయే వరకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప మధ్యాహ్నం 1.00 గంటకు ముందు ఏ ఒక్క అభ్యర్థిని పరీక్షా కేంద్రం నుండి బయటకు పంపడానికి వీలు లేదని తెలియజేశారు.
బాధ్యతలు అప్పగించిన అధికారులు, సిబ్బంది ఎలాంటి పొరపాట్లు, నిర్లక్ష్యానికి తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఒక్క తప్పు జరగడానికి వీలు లేదని హెచ్చరించారు.
పరీక్ష కేంద్రంలో సెల్ ఫోన్ తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని తెలిపారు.
అధికారులు ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పరిషిలించుకోవాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రంలో కనిపించే ప్రతి ఒక్కరి అధికారిక గుర్తింపు కార్డులు, హాల్ టికెట్ లు పరిశీలించాలి. పరీక్షల నిర్వహణకు సంబంధం లేని ఏ ఒక్కరూ పరిసరాల్లో కనిపించడానికి వీలు లేదన్నారు.
పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానికి పరికరాలకు అనుమతి లేదు. అధికారులు, ఇన్విజిలెటర్లు సైతం ఫోన్ కానీ డిజిటల్ గడియారం కానీ తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని తెలిపారు.
పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఎలాంటి వాహనాలు నిలపడాని వీలు లేదని తెలిపారు.
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయనీ హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి ప్రొజెక్టర్ ద్వారా బాధ్యతలు, నియమ నిబంధనలను వివరించారు.
రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 06 07 at 20.15.20

SAKSHITHA NEWS

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyouth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంయువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం – యువజన సంఘాల అధ్యక్షులు మండ అశోక్ కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 6 ) youth యువకులకు, సామాన్య ప్రజలకు…


SAKSHITHA NEWS

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSgodavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలుపెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page