SAKSHITHA NEWS

మంత్రి లోకేశ్​ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం- టీడీపీలో చేరిక లాంఛనమే!

శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేశ్​ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్​ పర్సన్ జకియా ఖానం కలిశారు. ఇప్పటికే మంత్రి ఫరూక్​తో భేటీ అయిన జకియా ఖానం, లోకేశ్​ని కుటుంబసభ్యులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జగన్​ సహా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్ని బహిష్కరించినా, జకియా ఖానం మండలికి హాజరవుతున్నారు. త్వరలో ఆమె తెలుగుదేశంలో చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

WhatsApp Image 2024 07 27 at 14.28.18

SAKSHITHA NEWS