SAKSHITHA NEWS

సైబర్ నేరాలపైన, సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి – యస్.పి

— సైబర్ అంబాసిడర్ గా ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల శిక్షణా కార్యక్రమం పూర్తి

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

సైబర్ నేరాలపైన, సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా యస్.పి అపూర్వ రావు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ మరియు విద్యా శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ అంబాసిడర్ ప్లాట్ ఫామ్ వేధికగా, సైబర్ అంబాసిడర్ ప్లాట్ ఫామ్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 88 పాఠశాలల నుండి 352 మంది విద్యార్ధులను, ఇద్దరు ఉపాద్యాయులను మెంటర్స్ గా ఎంపిక చేసి వారికి మూడు నెలల పాటు ఆన్లైన్ క్లాస్ ల ద్వారా ఉమన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్ ఇంఛార్జి రాజశేఖర్ గౌడ్ అధ్వర్యంలో నౌపుణ్యం కల సైబర్ శిక్షకుల ద్వారా సైబర్ నేరాలు వాటి వల్ల కలిగే నష్టాలు వాటిని ఎలా ఎదురుకుని తమ తోటి వారికి సైబర్ నేరాల పట్ల అవగాహన వాటి వల్ల కలిగే నష్టాలు వివరించే విదంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు పటిష్టమైన నిఘా షి టీమ్స్ ఏర్పాటు ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని, విద్యార్థునులకు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని,ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.


SAKSHITHA NEWS