బండి సంజయ్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టిన మహిళలు…

Spread the love

బండి సంజయ్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టిన మహిళలు…
కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల…
కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం…
వెంటనే అరెస్టు చేయాలని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు…
బండి సంజయ్ ఇంట్లో మహిళలు ఉన్న విషయం మర్చిపోవొద్దు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్


సాక్షిత : * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చింతల్ ఐడిపిఎల్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో బండి సంజయ్ దిష్టి బొమ్మను మహిళలు చెప్పులతో కొట్టి.. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసి.. దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం సంజయ్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో మహిళలు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఫుట్ పాత్ నాయకుడన్నారు. బిజేపికి రాష్ట్రంలో రోజు రోజుకీ ఆదరణ తగ్గడం తట్టుకోలేక బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే బండి సంజయ్ కి ఉన్న పని అన్నారు.

బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామన్నారు. హద్దు మీరి మాట్లాడే ముందు బండి సంజయ్ ఇంట్లో మహిళలు ఉన్న విషయం మర్చిపోవద్దన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తన వెనక కేంద్రం సహకారం ఉంది కదా అని నోటికొచ్చింది మాట్లాడుతున్న బండి సంజయ్ కి గుజరాత్ నుండి వచ్చి ఎవరూ కాపాడరని చివరికి తెలంగాణే దిక్కు అని అన్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బండి సంజయ్ ని తెలంగాణలో ఏ ఒక్క చోట కూడా తిరగనివ్వమని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page