SAKSHITHA NEWS

ముత్తుముల సమక్షంలో 100 కాపు కుటుంబాలతో సహా టీడీపీ తీర్ధం పూచ్చుకున్న మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ లు

ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం, చోళవీడు గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో చోళవీడు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిని లలితా కుమారి, మాజీ సర్పంచ్ బత్తిని వెంకటేశ్వర్లు, ఒక మాజీ ఎంపీటీసీ, ఒక విద్యా కమిటీ చైర్మన్, ముగ్గురు వార్డు మెంబర్లు, కాపు సంఘ ముఖ్య నాయకులు, గ్రామంలోని 100 కుటుంబాలతో సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన కాపు సోదరులు మాట్లాడుతూ కాపుల సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమని, గిద్దలూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ గుడిమెట్ట రంగనాయకులు, విద్యా కమిటీ ఛైర్మెన్ గుడిమెట్ట రంగయ్య, 5వార్డు మెంబర్ బత్తిని కృష్ణయ్య, 6వ వార్డు మెంబర్ బత్తిని అచ్చమ్మ, 1వ వార్డు చల్లా గురువయ్య, మాజీ వార్డు మెంబర్ పేర్ల నేమిలయ్య, ప్రసాద్, ఆపిశెట్టి ప్రసాద్, సిరిగిరి నందయ్య, ముత్యాల శివ, ముత్యాల నారాయణ, బత్తిని వెంకటరమణ, గుడిమెట్ట వెంకట రంగయ్య, గుడిమెట్ట రాములు, గుడిమెట్ట పాండు, గుడిమెట్ట రంగనాయకులు, గల్లా వెంకట రమణ, బత్తిని వెంకటరావు, మైల శేఖర్, అప్పీశెట్టి రంగయ్య, బత్తిని రంగస్వామి, జంగం శ్రీను, తురిమెల్ల పొలెయ్య, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అద్దంకి పెద్ద మౌలాలి, చౌడబోయిన రామలింగయ్య, మరియు మండల టీడీపీ అధ్యక్షులు కటికే యోగానంద్ మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.


SAKSHITHA NEWS