SAKSHITHA NEWS

మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి
విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ ఇబ్బంది ఉన్నా ఆదుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. పట్టణ పెన్షనర్ల సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి అంబటి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం అండగా నిలించిందన్నారు.

నియోజకవర్గంలో ఈ 48 నెలల్లో వ్యాపారస్తులకు, ప్రజలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించామన్నారు. రౌడీ యిజాన్ని అణచివేశామని వివరించారు. దాడులను, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదని ఇది మీరు గమనించాలన్నారు. పెద్దలుగా ఈ సుపరిపాలను పదిమందికి తెలయజేయాలని కోరారు. పెన్షనర్స్‌ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల భవనం సమస్యలలో ఉండగా ఆ సమస్యను పరిష్కరించేందుకు సహకరించిన మంత్రి అంబటికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను ఘనంగా సత్కరించారు. సంఘం సభ్యులు మీకు సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ, నియోజకవర్గ నాయకులు, సభ్యులు తదితరులున్నారు.


SAKSHITHA NEWS