కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతాము.

Spread the love

కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతాము.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన, ఏ పనికైనా చేసుకోగలుగుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దృష్టి లోపాన్ని సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా నగరంలో 23వ డివిజన్ లోని శాంతి నగర్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యల పై దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

కంటి వెలుగు ఒక మంచి ప్రజా ప్రయోజిత కార్యక్రమం అని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభిస్తామని సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కితాబునిచ్చారని, కంటి వెలుగు మొదటి విడతలో 1 కోటి 50 లక్షల మందికి స్క్రీనింగ్ చేసి 50 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేసామని గుర్తు చేశారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకావాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ మక్బూల్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, వైద్యాధికారి డా. ఎవాంజలిన్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page