SAKSHITHA NEWS

రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు

మార్కాపురం – ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకనుగుణంగా మార్కాపురం జిల్లా ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పటికీ ఇక్కడ ప్రజల ఘోష వినపడకుండా కనపడకుండా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్ షేక్ సైదా, వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాథ్’లు స్థానిక ప్రెస్’క్లబ్’లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. మార్కాపురం నూతన జిల్లా ఏర్పాటు విషయంలో ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని వారు అన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధికి మృతి కారణమైన జిల్లా ఏర్పాటు విషయంలోనూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ కల్లబొల్లి మాటలు తప్ప చేతల ప్రభుత్వముగా కనబడలేదని వారు అన్నారు. ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను ఇవ్వకుండా ఏవిధంగా పూర్తి చేస్తారో ఆ విషయం కూడా ముఖ్యమంత్రి సభా ముఖంగా తెలియజేస్తే బాగుండేదని విమర్శించారు. మార్కాపురం జిల్లా ఉద్యమం సజీవంగానే ఉన్నదని మార్కాపురం జిల్లా సాధించేవరకు ఉద్యమం ఆగబోదని వారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సాధన సమితి నాయకులు వి.సుదర్శన్, డీకేఎం రఫీ, షేక్ ఖాసిం, వై.పాలెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి పాకనాటి గౌతమ్ రాజు, పి.రూబేన్, జె.రాజు, యన్.పాపయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS