కవులూరులో ప్రతి గడపలో అపూర్వ ఆదరణ

SAKSHITHA NEWS

కవులూరులో ప్రతి గడపలో అపూర్వ ఆదరణ
ఆత్మీయ స్వాగతంలో ఆహ్వానిస్తున్న గ్రామస్తులు* పార్టీలకతీతంగా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు*
మూడవ రోజు కవులూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ .


సాక్షిత : ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మూడవరోజు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిగడపకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కవులూరు గ్రామస్తులు అతిథి మర్యాదలతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆత్మీయంగా వారి గడపల్లోకి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఇదే సందర్భంలో ఆయనకు గ్రామస్తులు సిమెంట్ రహదారులు, తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరగా శాసనసభ్యుని నిధుల నుంచి ఆయా సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయిస్తానని హామీలు ఇచ్చారు. అర్హతలు ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ లబ్ది పొందలేని వారికి, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98.5 శాతం అమలు చేశారని పేర్కొన్నారు. కుల, మత, వర్గ, జాతి, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేశామని, మీకు మంచి చేస్తేనే మీరంతా జగనన్నకు తోడుగా ఉండాలన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, వాళ్ల కుట్రలను చేధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ , మండల వైకాపా అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు , సచివాలయాల మండల కో ఆర్డినేటర్ కాజా బ్రహ్మయ్య , వైస్ ఎంపీపీ ఈలప్రోలు తేజస్విని , సర్పంచి కొండా మరియమ్మ , ఉప సర్పంచ్ బొర్రా నరేంద్రబాబు , ఎంపీటీసీ డోల మధుబాబు , నాయకులు గొట్టుముక్కల ఓంకార్ బాబు , ఈలప్రోలు వెంకటేశ్వరరావు , గుణదల వెంకటేశ్వరరావు , సూదిరెడ్డి సురేష్ , బొర్రా భూలక్ష్మీ , చెరుకూరి సాంబశివరావు , బేతపూడి కృష్ణవేణి , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైకాపా నాయకులు, ముస్లిం, మైనార్టీ సోదరులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSappeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిఅల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని కమిషనర్ కి విజ్ఞప్తి తిరుపతి నగరం appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతి నగరంలో ప్రతిష్టించాలని కోరుతూ…


SAKSHITHA NEWS

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ alluri అల్లూరి సీతారామరాజు జీవితం అందరికి ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి…


SAKSHITHA NEWS

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page