SAKSHITHA NEWS

చీరలు, గాజులు వేసుకొని తిరగండి..!!!

కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యేలకు కౌశిక్​ రెడ్డి గిఫ్ట్​

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. హైకోర్టు ఆదేశాలను కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు తీర్పుతో 10 మంది ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యమన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకుని తిరగండంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గిఫ్ట్ కింద గాజులు, చీరలు పంపిస్తున్నా అంటూ వాటిని మీడియా ముందే ప్రదర్శించారు పాడి కౌశిక్‌రెడ్డి. దానం నాగేందర్, కడియం శ్రీహరి చీటర్, మోసగాళ్లు అంటూ ఘాటుగా స్పందించారు.

వారిద్దరు చీటర్స్​
పార్టీ మారిన దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీహ‌రిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజ‌మెత్తారు. దానం, క‌డియం లాంటి చీట‌ర్లు ఈ ప్రపంచంలోనే లేరు అని కౌశిక్ రెడ్డి మండిప‌డ్డారు. ‘‘ మిస్టర్ దానం నాగేంద‌ర్ సాబ్.. బిచ్చగానివి నువ్వు.. అని నేను అన‌లేదు.. మీ ముఖ్యమంత్రే నువ్వో బిచ్చగానివి.. ఓ బార్ ద‌గ్గర బీడీలు అమ్ముకుంటున్నావ‌ని రేవంత్ రెడ్డే అన్నారు. పూట‌కో పార్టీ మారేది.. పూట‌కో మాట మాట్లాడేది నువ్వు క‌దా..? కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు.. అటునుంచి తెలుగు దేశంలోకి వెళ్లావు. దాని త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చావు.. అటునుంచి బీఆర్ఎస్‌లోకి వ‌చ్చావు.. మ‌ళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరావు. యూ ఆర్ నేమ్డ్ యాజ్ ఏ చీట‌ర్ ఆఫ్ హైద‌రాబాద్.. నీ కంటే పెద్ద చీట‌ర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్టేష‌న్‌లో మాట్లాడుతున్నావ్. మొన్న బీఆర్ఎస్ పార్టీని చీట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి, సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ప్రజ‌లు నీకు బుద్ది చెప్పారు. నువ్వు రేపు ఎమ్మెల్యేగా కాదు.. మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు. ఇది గ్యారెంటీ దానం నాగేంద‌ర్ రాసి పెట్టుకో’’ అని పాడి కౌశిక్ రెడ్డి స‌వాల్ చేశారు.

క‌డియం శ్రీహ‌రి ప‌చ్చి మోస‌గాడు..
క‌డియం శ్రీహ‌రి ఏదేదో మాట్లాడుతున్నడని, రెండో బెంచ్ ఉన్నద‌ట‌. ఇక మూడో బెంచ్ కూడా ఉంట‌ద‌ట‌ అని అంటున్నాడని విమర్శించారు. సిగ్గులు, శ‌రాలు లేవు అని, పార్టీలు మారినోళ్లకు. ల‌జ్జ, మానం, ఇజ్జత్ ఉండదన్నారు. ద‌మ్ముంటే రాజీనామా చేసి, ఎల‌క్షన్లకు రావాలని, ప్రజ‌లు జ‌వాబు చెబుతారు అని సవాల్​ చేశారు. క‌డియం శ్రీహ‌రి ప‌చ్చి మోస‌గాడు అని, తానేదో పెద్ద క్యారెక్టర్ మ‌నిషిన‌ని చెప్పుకుని పెద్ద బిల్డప్ ఇస్తాడని, ఆయ‌నంత పెద్ద చీట‌ర్‌ని ఈ ప్రపంచంలో చూడ‌లేదని కౌశిక్​ రెడ్డి మండిపడ్డారు.


SAKSHITHA NEWS