SAKSHITHA NEWS

TRS పార్టీలోనే ఉద్యమకారులకు ఉన్నతమైన స్థానం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస ఆవరణలో తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వికారాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జొన్నల రవి శంకర్ ను TRS పార్టీ కాండువా కప్పి TRS పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ సందర్బంగా వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ… TRS పార్టీలోనే ఉద్యమకారులకు ఉన్నతమైన సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కన్నతల్లిలా కాపాడుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS