SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించాలని..ఏబీవీపీ ఆధ్వర్యంలోరోడ్డు ఎక్కిన విద్యార్థులు
సాక్షిత వనపర్తి జూన్ 26
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యాసంస్థల బంద్ కి ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుధవారంవనపర్తి జిల్లా కేంద్రంలో స్కూల్స్ బంద్ చేసి రోడ్డుమీద విద్యార్థులతో నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేక సరిపడ అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే మరొకవైపు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్న వైనం ఇవేవీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ చేతులు దులుపుకుంటుంది.

అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపైన చర్యలు తీసుకుంటామంటూ, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడిని అరికట్టడంలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం పాఠశాల ల బంద్ కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిందని తెలియజేశారు.

అన్ని పాఠశాలల యాజమాన్యాలు బంద్ కు సహకరించి, బంద్ ని విజయవంతం చేయాలని కోరారు.

డిమాండ్స్

  1. ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.
  2. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి.
  3. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలి.
  4. ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి.
  5. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. వెంటనే DEO, MEO అధికారులను నియమించాలి.
  6. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న మధ్యాహ్నభోజనంలో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి, నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి మరియు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.
  7. మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి.

భవదీయ

  1. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి
    ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ, రమ్య, కేదార్నాథ్,దేవి,అరవింద్,వినయ్, జ్ఞానేశ్వర్,వెంకటేష్,జ్ఞానేశ్వర్, బాలు, మరియు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించాలని

SAKSHITHA NEWS