మాకు బతుకు తెరువు పోయిందని మీడియా ముందు వాపోయారు

మాకు బతుకు తెరువు పోయిందని మీడియా ముందు వాపోయారు

SAKSHITHA NEWS

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

నగరి పట్టంలో చావడి వద్ద బాడుగ అంగడిలో గత 22 సంవత్సరాలు హోటల్ నడుపుతున్న మురుగేసున్ కరోనా సమయంలో ఆరోగ్య సమస్య కారణంగా హోటల్ మూసివేయబడింది , ఆరోగ్యం కుదుట పడడంతో హోటల్ కీ మరమ్మతులు చేయించారు మంచి రోజు చూసుకుని హోటల్ తెరవాలని అనుకున్నారు ఇంతలో ఆ అంగడి యజమాని తెల్లవారి జామున జెసిబి తో ఆ అంగడిని పడగొట్టాడు, మాతో ఒక్క మాట కూడా చెప్ప కుండా ఇలా చేశారని అంగడిలో వున్న వస్తువులు అంతా పాడై పోవడంతో సుమారు రెండు లక్షలు రూపాయల నష్టం కలిగిందని మాకు బతుకు తెరువు పోయిందని మీడియా ముందు వాపోయారు మీరే మాకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు.


SAKSHITHA NEWS