ఇష్టం లేకుండా ముద్దు పెట్టాడని నాలికను కొరికేసిన భార్య

Spread the love

కర్నూలు జిల్లా:
అవును వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లయిన కొత్తలో వారి అన్యోన్య దాంపత్యం సాఫీగా సాగింది

ఏం జరిగిందో ఏమోగానీ రెండేళ్లుగా వారి మధ్య కలతలు మొదలయ్యాయి.. ఒకరంటే ఒకరికి పడదు.. నిత్యం గొడవలు.. శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారు. భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగాడా? అసలే పీకల్లోతు కోపంలో ఉన్న ఆమెను ముద్దుపెట్టబోయాడు. అంతే.. కసుక్కున భార్య అతని నాలుకను కొరికేసింది.

అసలు విషయం ఏమిటంటే..కర్నూలు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్‌.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాకు చెందిన పుష్పవతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే అన్యోన్యంగా ఉన్నారు. రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారు.

ఒకరు ఒకరి మీద దాడి చేసుకున్నారు

కొద్దిసేపటి తర్వాత మనోడు వెళ్లి లిప్ కిస్ కోసం ట్రై చేశాడు, అప్పటికే పీక ల్లోతు కోపంతో ఉన్న ఆమె వెంటనే భర్త నాలుకను కొరికేసింది. దీంతో అల్లాడిపోయిన తారాచంద్.. హుటాహుటిన గుత్తి హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాడు. తారాచంద్‌ను పరీక్షించిన వైద్యులు మెరుగైన మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం హాస్పిటల్‌కు సిఫార్సు చేశారు. ఇక ఈ విషయమై భార్యాభర్తల వర్షన్ వేరుగా ఉంది. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆపై తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని అందుకే నాలుక కొరికానని పుష్పవతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తారాచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యకు వేరొక వ్యక్తితో అఫైర్ ఉందని అయినా కూడా తాను సర్దుకుపోతున్నానని తెలిపాడు. తన భార్యతో తనకు ముప్పు ఉందని చెప్పాడు. తన పిల్లలూ.. తాను ఎలా బతకాలో తెలియడం లేదని వాపోయాడు

Related Posts

You cannot copy content of this page