టీఆర్ఎస్ పాలనలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట

Spread the love

టీఆర్ఎస్ పాలనలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్


సాక్షిత : మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని, ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణా లో మైనారిటీల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నారని… ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన ముస్లీం మైనారిటీ నాయకులు శనివారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కలసి మండల కేంద్రంలో ముస్లీం మైనారిటీల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించారు. మండల కేంద్రంలో ఈద్గా, స్మశాన వాటిక ల వద్ద ప్రహరీ నిర్మాణం, మసీదు ల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సానుకూలంగా స్పందించి వెంటనే అమెరికా లో ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో వీడియో కాల్ లో మాట్లాడగ, ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధి పనుల కొసం నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. అనంతరం మైనారిటీ నాయకులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి డైరక్టర్, అమన

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page