ఆస్థి పన్నువసూళ్లు అత్యధికంగా రూ.6కోట్ల 20లక్షలు వసూలు

Spread the love

బాపట్ల టౌన్ :బాపట్ల పురపాలకసంఘం చరిత్రలో మొదటిసారిగా 2022-2023 ఆర్ధికసంవత్సరానికి గాను ఆస్థి పన్నువసూళ్లు అత్యధికంగా రూ.6కోట్ల 20లక్షలు వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు.బాపట్ల పురపాలక సంఘంలో మొత్తం 17 వేల అసెస్మెంట్లకు గాను 8కోట్ల 80లక్షలు డిమాండ్ వుండగా రూ.6కోట్ల 20లక్షలు వసూలు చేసి రాష్ట్రంలోని *123 మునిసిపాలిటీలలో 15 వ స్థానంలో నిలిచింది. పన్నువసూళ్ల కార్యక్రమం లో సహకారం అందించిన వార్డు అడ్మిన్, సెక్రెటరీలకు మరియు వార్డు వాలంటీర్లకు ఇతర రెవిన్యూ మరియు కార్యాలయ పన్ను వసూలు సిబ్బందిని మునిసిపల్ కమీషనర్ అభినందించారు. పన్నులు చెల్లించి పట్టణభివృద్ధికి సహకరించిన పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలియజేసారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page