ఉద్యమకారుడు సాగర్ యాదవ్ మరణం పార్టీకి తీరనిలోటు

Spread the love

ఉద్యమకారుడు సాగర్ యాదవ్ మరణం పార్టీకి తీరనిలోటు…

చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గొల్ల విద్యాసాగర్ యాదవ్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడగా.. ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అతని నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు విద్యా సాగర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యమ సమయంలో ధర్నాలు, రాస్తారోకోలలో చురుకుగా పాల్గొని.. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించిన సాగర్ యాదవ్ మరణం పార్టీకి తీరనిలోటు అని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి మరియు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page