అరాచక వైసిపి పాలనను చరమగీతం పాడాలి…ఎంజీఆర్

Spread the love

స్థానికేతర నాయకులను తరిమికొట్టాలి

హిరమండలం మండలంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు

సూపర్ 6 పథకాలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

సైకిల్ గుర్తు పై ఓటు వేసి ఎమ్మెల్యే గా నన్ను,ఎంపీ గా రామ్మోహన్ నాయుడు ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు

కూటమి అభ్యర్థికి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న మహిళలు, ప్రజలు

రాష్ట్రంలో అరాచక వైసిపి పాలనకు చరమగీతం పాడాలని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం,జనసేన,బిజెపి మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు హిరమండలం మండలంలోని భగీరథపురం,భగీరథపురం కాలనీ, పిండ్రువాడ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం స్థానికేతర పాలనలో అభివృద్ధి కుంటిపడిందని,స్థానికేతర నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు అలాగే సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే గా నన్ను ఎంపీ గా రామ్మోహన్ నాయుడు ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అభివృద్ధి,సంక్షేమం,సమన్యాయం ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని అన్నారు ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థికి మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో హిరమండలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాళ్ళనాగేశ్వరరావు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్,గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు, ధనుపురం మాజీ సర్పంచ్ మామిడి గంగాధర రావు,అప్పల రెడ్డి,మామిడి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page