SAKSHITHA NEWS

Telugu Desam Party special prayers to Deshamma’s mother for continued success of Nara Lokesh Yuvagalam

నారా లోకేష్ యువగళం విజయవంతంగా కొనసాగాలని దేశమ్మ తల్లికి ప్రత్యేక పూజలు తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి పాదయాత్ర విజయవంతం కావాలని నగరి పట్టణ మరియు రూరల్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరి పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నేత్ర ప్రదాత ఆదిపరాశక్తి హంసమైన నగరి శ్రీ దేశమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . యువగళం, పేరు మీద కుప్పం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆదిపరాశక్తి దేశమ్మతల్లికి 151 టెంకాయలు కొట్టి మ్రోక్కులు తీర్చుకున్నారు.


గత ప్రభుత్వంలో జగన్ చేసిన పాదయాత్రకు అన్ని విధాలుగా సహకరించామని గుర్తించుకోవాలని ప్రస్తుత జగన్ ప్రభుత్వం వారిని మరియు అధికారులను అదే రీతిలో మీరు ఎందుకు సహకరించడం లేదని కోరుతున్నాము. ప్రజలతో మమేకమవుడకు యువత యొక్క కష్టాలను గుర్తించి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో వారి కష్టసుఖాలను తీర్చుటకు కంకణం కట్టుకున్న నారా లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకోవడం ఆటంకాలు సృష్టించటం ఇబ్బందులు పెట్టడం శోచనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్తకంఠంతో విమర్శించారు .

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు ,రూరల్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ,టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి బాలాజీ ,రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఖాదర్ భాయ్, చిత్తూరు పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి జ్యోతి నాయుడు, దేశమ్మ ఆలయం మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి జిల్లా కార్యదర్శి బాలాజీ సీనియర్ నాయకులు గుణశేఖర్ నాయుడు , నారాయణ స్వామి,రాష్ట్ర బీసి సాదికార సమితి సభ్యులు యస్.సెందిల్ కుమార్, నాయకులు మహేష్ బాబు ,పంచాయితీ పార్టీ కార్యదర్శి వేణుబాబు, ఏ గోపిరెడ్డి ,మునుస్వామి, యువత నాయకులు చిట్టి ,ఎలుమల్లైనాయుడు, రైతు సెక్రటరీ జవహర్ రెడ్డి, మైనారిటీ పార్టీ కార్యదర్శి సలీం, మాణిక్యవాసం ,టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఆకుల అశోక్, కిషోర్ బాబు, యువత సభ్యులు ఎం కె ఆర్ రమేష్ ,పాల్గొన్నారు.


SAKSHITHA NEWS