SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా చీరాల ఆర్ టీ సి బస్ స్టాండ్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ మాజిముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు,కౌతావరపు జనార్దన్,గంజి పురుషోత్తం,నరాల తిరుపతి రాయుడు,రబ్బానీ,ఆనంద్,రాంబాబు,కొమ్మనబోయిన రజని,లావణ్య,సుబ్బలక్ష్మి తదితరులు.

ఈ సందర్భంగా గజవల్లి శ్రీనివాసరావు,కౌతావరపు జనార్దన్ లు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఒక్క సంవత్సరాలు పూర్తిచేసుకుంది.రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా చీరాలలో ఎం.ఎం.కొండయ్య ఎం ఎల్ ఏ గా గెలవడం కూడా ఖాయం గెలిపించుకుంటాం.పారిలో కొంతమంది కో వర్ట్లు ఉన్నారు. వారి ఆటలు సాగవు అని తెలిపారు.

కొసమెరుపు:- చీరాల బస్ స్టాండ్ వద్ద ఉన్న ఎన్ టీ ఆర్ విగ్రహం వద్ద తెలుగు తమ్ముళ్లు జెండా ను ఆవిష్కరించడం చూపరులను ఆచ్చర్యానికి గురిచేసింది.


SAKSHITHA NEWS