SAKSHITHA NEWS

ఉమ్మడి ప్రకాశం జిల్లా

కందుకూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .

నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాలతో, తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం… పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను మొదటిసారిగా అందించింది ఎన్టీఆర్ ప్రభుత్వమేనని నేతలు వివరించారు. రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ఎన్నో అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ ఆశయాలను పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకు వెళుతున్నారని, నారా లోకేష్ కూడా యువగళమై ప్రజల పక్షాన పోరాడుతున్నారని తెలిపారు.

అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని అన్ని వార్డులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సందడిగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, మహిళా కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు


SAKSHITHA NEWS