చంద్రబాబుతోనే మహిళాభ్యుదయం సాధ్యం : ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య

Spread the love

చంద్రబాబు మహిళా పక్షపాతి అని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో మహిళాభ్యుదయం సాధ్యమని టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం నందగామ పట్టణం రెండవ వార్డు (మయూరి థియేటర్ ఏరియా)లో ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో, సూపర్‌సిక్స్‌ పథకాలు ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం మొండితోక వసూల్ బ్రదర్స్ నందిగామలో ఐదేళ్లుగా చేస్తున్న అరాచకపాలనను వివరించారు. మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని మొదటి నుంచి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయితే సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా మహిళలను మరింత పోత్సహించనున్నారన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథం (చిన్ని)కు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ పార్టీ మరియు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page