SAKSHITHA NEWS

సల్లంగా చూడు శివయ్య…!

  • శైవాలయాల్లో పొంగులేటి ప్రత్యేక పూజలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు శైవాలయాలను శనివారం సందర్శించారు. దమ్మపేట శివాలయం, పెనుబల్లి నీలాద్రీశ్వరాలయం, పుల్లయ్య బంజరలోని అప్పయ్య స్వామి గుడి, వైరాలోని స్నానాల లక్ష్మీపురం, ఖమ్మం నగరంలోని గుంటు మల్లన్న, ఖమ్మం రూరల్ తీర్థాల కూడలి జాతర, కూసుమంచి గణపేశ్వర ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు, రుద్రాభిషేకాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని శివయ్యని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.


SAKSHITHA NEWS