SAKSHITHA NEWS

సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రక్షాబంధన్ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS