SAKSHITHA NEWS

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

…….
.

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం రవ్వారం, మేకపాడు గ్రామాల్లో నిర్వహించగా, గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది..జగన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సగటున 1లక్ష రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందని, అందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కి కృతజ్ఞతలు తెలిపుతూ, మళ్లీ.. మళ్లీ జగన్న నాయకత్వం లో *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * ఇక్కడ శాసనసభ్యులు గా అత్యధిక మెజార్టీతో గెలుపొంతారని ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా వారి స్పందన తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయా, లేదా అని అలాగే గ్రామంలోని పలు సమస్యలను తెలుసుకోవటం కోసం స్వయంగా శాసనసభ్యులు వారే మండల స్థాయి అధికారుల తో కలిసి గడప గడపకు తిరిగి వారి యెక్క సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం అందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, ఎటువంటి సమస్యలు ఉన్నా, నాకు తెలియపరిస్తే తక్షణ పరిష్కారం చూపుతామని గ్రామ ప్రజలకు తెలియజేశారు.

కార్యక్రమం అనంతరం రవ్వారం గ్రామం లో నూతనంగా నిర్మించిన వైయస్సార్ గ్రామ ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి,నూతన భవనాన్ని ప్రారంభించారు.


SAKSHITHA NEWS