SAKSHITHA NEWS

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ లోని గాగిల్లాపుర్ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. ఆలయ ధ్వజస్థంబ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగరాజ్ యాదవ్,కౌన్సిలర్లు కుంటి అరుణ నాగరాజు, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దుండిగల్ మునిసిపల్ బీఅర్ఎస్ పార్టీ అద్యక్షులు సంజీవ రెడ్డి, రైతు సమన్వయ మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి,125 డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి,సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, నవీన్, కుమ్మరి మల్లేష్,నర్సింహ గౌడ్,భక్తులు తదితరులు పాల్గొన్నారు….


SAKSHITHA NEWS