SAKSHITHA NEWS

తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు, యువనేత డాక్టర్ కోడెల శివరాం నర్సింగపాడు లోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సతి సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా నియోజకవర్గంలోని నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో వేంచేసిన అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం నందు యువ నేత డాక్టర్ కోడెల శివరాం, పద్మప్రియ దంపతులు ప్రత్యేక అభిషేకములు, పూజలు చేశారు.

ముందుగా ఆలయ అర్చకులు, ఆలయ నిర్వాహకులు యువనేత డాక్టర్ కోడెల శివరామ్ కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. రైతులు బాగుండాలని, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆ విశ్వేశ్వరుని కోరుకున్నట్లు యువనేత డాక్టర్ కోడెల శివరాం తెలిపారు. కార్యక్రమంలో కోడెల వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోడెల అభిమానులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS