SAKSHITHA NEWS

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులతో రాఖీ పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే…

…….

.సాక్షిత : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో రాఖీ పండుగను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ విద్యార్థినులతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు రాఖీ కట్టారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థినులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇష్రత్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరియు కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS