SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్, కృష్ణవేణి కాలనీ లో చేపడుతున్న మంజీర పైప్ లైన్ వాల్వు మరమ్మత్తు పనులను, కాలనీలో నెలకొన్న మంచి నీటి సమస్యను కాలనీ వాసులతో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన మరమత్తు పనులు పూర్తి చేసి నీటి సరఫరా కి ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ఎక్కడైనా లీకేజ్ అయ్యే పరిస్థితి ఉన్న పైప్ లైన్ లను గుర్తించి లీకేజీ మళ్ళీ సంభవించకుండా వాటిని కూడా సరిచేయాలని డివిజన్ లో ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని అధికారులకు కార్పొరెటర్ నార్నె శ్రీనివాస రావు సూచించారు. అదేవిధంగా ప్రతి కాలనీ, బస్తీల‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూస్తానని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని. మీ కాలనీ లలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నన్ను కానీ, కార్పోరేటర్ కార్యాలయాన్ని కానీ సంప్రదించాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శేఖర్, కుమార్ యాదవ్, ఉపేందర్, వెంకటేష్, నరేందర్, ధనుంజయ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS