SAKSHITHA NEWS

అగ్నిప్రమాదంలో తగలబడిన శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ ని సందర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.*

అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామం సిద్ధార్థ కాలనీకి చెందిన నాగేశ్వరరావు శ్రీ లక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కరెంట్ షాక్ తో అగ్నిప్రమాదంలో తగలబడింది,
ఆ స్టోర్ ని సందర్శించి అతనికి ఎన్.ఎం.ఆర్ యువసేన తరఫున లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని నీలం మధు ముదిరాజ్ అందించారు. నియోజవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన తెలిపారు ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో వేలాదిమంది ఎన్ఎంఆర్ యువసేన లో చేరుతూ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నారు.

వారికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటానని ఆయన తెలిపారు. నా తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఉపయోగం జరిగితే సంతోషించే తొలి వ్యక్తి నేనే అని తెలిపారు,ఈ కార్యక్రమంలో పటేల్ సుధాకర్,మహేష్, రాంకు సంతోష్,రమణ,పంతులు సుధాకర్, సాయి,రాజేందర్, చందు,భశిర్,సందీప్, కాలనీ వాసులు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS