SAKSHITHA NEWS

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్దంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని అన్నారు.

సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాథను పాపన్న వర్దంతి సందర్భంగా స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని గుర్తు చేశారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, పాండుగౌడ్, పోశెట్టిగౌడ్, రాములుగౌడ్, వెంకటేష్ గౌడ్, CH. భాస్కర్, బాలస్వామి, యాదగిరి, యం. రాజు, మల్లేష్, మోజెస్, ఎచ్.మహేష్, సంతోష్, ఉమేష్, రవీందర్, నాగరాజు, సాయి, రాధాకృష్ణ గౌడ్, శ్రీను గౌడ్, కార్తీక్ గౌడ్, వినిత్ గౌడ్, బాలస్వామి సాగర్, రాజ్యలక్ష్మి, పుట్టం దేవి, స్వప్న, నిర్మలమ్మ, బి.లక్ద్మీ, సరిత, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS