ఘనంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణం

Spread the love

నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి

నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గ్రామంలో ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రోజు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి- రాజేశ్వరి దేవి ల ఆధ్వర్యంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి మాస కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు వేదమంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారి అంబటి నాగిరెడ్డి, కళ్యాణ మహోత్సవంలో కూర్చున్న దంపతులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page