SAKSHITHA NEWS

కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా రమ్య కీర్తన బాధ్యతల స్వీకారం

కొండపల్లి మున్సిపాలిటీ, : కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బి.రమ్య కీర్తన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిప్యూటేషన్ పై పనిచేస్తున్న కమిషనర్ వై.శంకర్ నాయక్ గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.

ఆయన స్థానంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ గా ఉన్న రమ్య కీర్తన కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS