SAKSHITHA NEWS

ధర్మారం మండలంలోని పత్తిపాక, నర్సింగపూర్,మల్లాపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు,మండల నాయకులతో కలిసి సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.*

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చూడాలని,ఎటువంటి ఇబ్బందీ ఉన్న తన దృష్టికి తీసుకురావాలని,మార్కెటింగ్ అధికారులు,నూతనంగా నియమకైన మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలనీ, రుణమాఫీ వర్తించని రైతులకు రుణమాఫీ జరిగేలా చూసే బాధ్యత తనే స్వయంగా తీసుకుంటానని,దీని గురించి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని,ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS