షాపూర్ నగర్ సాగర్ హోటల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం

Spread the love

సిఐటియు, ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో సూపర్ మ్యాక్స్ కార్మికుల 9నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించాలని షాపూర్ నగర్ సాగర్ హోటల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కీలుకాని లక్ష్మణ్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉమా మహేష్ మాట్లాడుతూ కంపెనీలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలి పెండింగ్లో ఉన్న వేతనాలు బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అని అన్నారు. లేనిపక్షంలో మిగతా కార్మిక సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జిల్లా వ్యాప్త ఉద్యమంగా దీన్ని తీసుకెళ్తామని అన్నారుఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే.బీరప్ప ఈ,దేవదానం ఎఐటియుసి పుల్లాపూర్ మండల కార్యదర్శి స్వామి మండల నాయకులు శ్రీనివాస్ సూపర్ మాక్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఐఎస్ రావు, ఈశ్వర్ రావు ,లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనము శ్రీనివాస్, కిరోసిన్ శీను, మేడి చంద్రశేఖర్ సురేష్ బాబు ,చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page