SAKSHITHA NEWS

ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు: మంత్రి ఉత్తమ్‌

ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు: మంత్రి ఉత్తమ్‌
ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. మంచి ఆదాయం వచ్చే ప్రాజెక్టులను అదానీకి అప్పగించారని మండిపడ్డారు. ‘అదానీతో సెబీ ఛైర్మన్‌ కుమ్మక్కయ్యారు. కృత్రిమంగా అదానీ షేర్ల విలువను పెంచి అక్రమాలు చేశారు. అదానీ, సెబీ ఛైర్మన్‌ కలిసి చేసిన మోసాలను హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. సెబీ, అదానీ కుంభకోణంపై విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS