ముగ్గురు సీనియర్ ఐఏఎస్లకు పోస్టింగ్
సీనియర్ ఐఏఎస్లు పూనం మాలకొండయ్య, జవహర్ రెడ్డి, పీయూష్ కుమార్కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక కార్యదర్శిగా జవహర్ రెడ్డి, జీఏడీలో జీపీఎం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్యను నియమించింది. కాగా, వీరిద్దరూ ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అలాగే సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![ముగ్గురు సీనియర్ ఐఏఎస్లకు పోస్టింగ్ 2 ముగ్గురు సీనియర్ ఐఏఎస్లకు పోస్టింగ్](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-12.58.11.jpeg)