పార్కులు కూడా వదలకుండా కబ్జాలు

Spread the love

పార్క్ స్థలం కాపాడాలంటూ స్థానికులు
సాక్షిత కుత్బుల్లాపూర్ : సూరారం : పార్కులు కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్నారు పార్క్ స్థలాని కాపాడాలని వేడుకుంటున్న కాలనీ వాసులు విషయం ఏంటి అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం లోగల విశ్వకర్మ కాలనీలో గతంలో ప్రభుత్వం పట్టాలు కేటాయించింది, అయితే ఇక్కడ విశ్వకర్మ కాలనీ లో పార్క్ కోసం దాదాపుగా 600 గజాల స్థలం వదలడం జరిగింది అయితే ప్రభుత్వం ఇందులో ఎలాంటి డెవలప్మెంట్స్ చేపటలేదు రోజు రోజుకి పెరుగుతున్న ధరలు ఇక్కడి స్థలలకి కూడా రెక్కలు వచ్చి దాదాపుగా గజం యాభై వేల వరకు ఉంది, గతంలో ఈ స్థలం పైన కబ్జా దారుల కన్ను పడింది, అదే అదునుగా కట్టడాలు కూడా చేసారు

, అయితే అప్పుడు ఫిర్యాదులు అందుకున్న రెవిన్యూ అధికారులు తక్షణమే స్పందించి అక్కడి వెళ్లి ఆ కట్టడాలను కూల్చి వేశారు, ఇప్పుడు ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారులు చర్యలు చేపట్టడం లేదని పార్కు స్థలాన్ని కాపాడాలి అని కాలనీ వాసులు కోరుతున్నారు, దాదాపుగా ఈ స్థలం రెండు కోట్ల వరకు విలువ ఉంటుంది అంటున్నారు, ఇప్పుడు ఆ పార్క్ స్థలం లో రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపడుతున్నారు అని సమాచారం అధికారులు తక్షణమే స్పందించి పార్క్ స్థలాన్ని కాపాడాలి అని అంటున్న స్థానికులు, అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి మరి

Related Posts

You cannot copy content of this page